పహల్గామ్ ఉగ్రదాడి కేసులో కొత్త మలుపు.. హఫీజ్ సయీద్ పేరు చేర్చిన ఎన్ఐఏ
పహల గ మ ఉగ రద డ క – జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ప్రభావితం చేసింది. ఇప్పుడు దర్యాప్తు సాగుతున్న ఈ కేసులో ఎన్ఐఏ మరో కీలక ముందడుగు వేసింది. దాడి వెనుక ప్రధాన సూత్రధారి నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ అని ఎన్ఐఏ పేర్కొంది. వెనుక అతనిని సప్లిమెంటరీ చార్జ్షీట్లో అధికారికంగా నిందితుడిగా చేర్చింది.
ఇప్పటికే ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్షీట్లో హఫీజ్ సయీద్ను వ్యక్తిగతంగా కాకుండా, లష్కరే తోయిబా అధినేతగా, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ నాయకుడిగా కూడా పేర్కొంది. ఇందులో భారతీయ న్యాయ సంహిత (BNS)-2023 మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఆరోపణలు నమోదు చేసింది. ఆరోపణలలో పాకిస్థాన్ దేశాన్ని ప్రమాదం కలిగించడం, ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలకు ప్రణాళిక రూపొందించడం వంటి విషయాలు చార్జ్షీట్లో నమోదు చేసింది.
2025 ఏప్రిల్ 22న పహల్గామ్లోని బైసరన్ మైదానంలో ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ దాడిలో 25 మంది పర్యాటకులు మరియు ఒక స్థానికుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవగా, భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్థాన్ మరియు ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై సైనిక చర్య చేపట్టింది.
దర్యాప్తు విస్తరణ
దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాదులు సంప్రదాయ చొరబాటు మార్గాలకే పరిమితం కాకుండా డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డబ్బు, పేలుడు పదార్థాలను స్వీకరించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. వివరాల ప్రకారం, 2024 ప్రారంభంలో బారాముల్లాలోని గోగల్ దారా అడవుల్లో డ్రోన్ ద్వారా 20 పిస్టళ్లు, రూ.15 లక్షల క్యాష్, చైనా తయారీ గ్రెనేడ్లు ఉగ్రవాదుల



