తిరుమలలో కోతుల వీరంగం: జపాలి తీర్థంలో భక్తులపై దాడి

Share: X Facebook
e36d7e52-8722-4be0-b697-0c89dc8ce1ae-0

జపాలి తీర్థంలో కోతుల దాడి: ఐదుగురు భక్తులకు గాయాలు

Indiabreakingdaily.com – త ర మలల క త ల వ – సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఆశతో కొందరు భక్తులు వానరాలకు దగ్గరగా వెళ్లి ఆహారం పెడుతున్నారు. ఈ చర్య వల్ల కోతులు మరింత దూకుడుగా మారుతున్నాయని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నారు.

తిరుమలలోని జపాలి హనుమాన్ తీర్థంలో తాజాగా జరిగిన ఘటన భక్తులను భయాందోళనలకు గురిచేసింది. స్వామివారి దర్శనానికి వచ్చిన ఐదుగురు భక్తులపై కోతులు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో గాయపడిన వారిని వెంటనే తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.

భక్తుల డిమాండ్: తక్షణ రక్షణ చర్యలు

జపాలి తీర్థం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండటం వల్ల ఇక్కడ కోతుల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఆలయం ఎదుట భక్తులు సమర్పించే కొబ్బరికాయలను దక్కించుకోవడానికి కోతులు గుంపులుగా వచ్చి దాడులు చేస్తున్నాయి. దీంతో భక్తులు భయంతో వణికిపోతున్నారు.

భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అటవీశాఖ, టీటీడీ అధికారులు తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని భక్తులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలో వానరాల బెడద రోజురోజుకూ మితిమీరిపోతోంది.

►ALSO READ | సీఐ నాగరాజు విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. జులై 28 నుంచి సిట్ కస్టడీలోకి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *