IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్‌‌‌‌‌‌‌‌లో దారుణం..చంపి.. చెత్తకుండీలో వేసి తగలబెట్టారు

Published August 7, 2026 · Updated August 7, 2026 · By Daniel Wilson - indiabreakingdaily.com

Foto : Daniel Wilson - indiabreakingdaily.com

హైదరాబాద్‌లో లోయర్ ట్యాంక్ బండ్‌కు చెత్తకుండీలో మహిళ శవం

Indiabreakingdaily.com – హ దర బ ద ల యర ట - హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళను హత్య చేసి, ఆమె శవాన్ని చెత్తకుండీలో వేసి నిప్పు పెట్టారు. బుధవారం రాత్రి 10:30 నుంచి 11:30 గంటల మధ్య ఈ సంఘటన జరిగింది. స్థానికులు చెత్తకుండీ నుంచి మంటలు వస్తుండటం గమనించి దగ్గరకు వెళ్లగా, కాలిపోతున్న శవం కనిపించింది.

దీంతో వెంటనే దోమలగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఫైర్ సిబ్బందితో వచ్చి మంటలను ఆర్పారు. ఆ శవం మహిళదిగా గుర్తించగా, అప్పటికే 95 శాతం వరకు కాలిపోయి ఉంది. మృతురాలి వయసు 35 నుంచి 45 ఏండ్ల మధ్య ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఆమె పండ్లకు పాన్, గుట్కా తిన్న ఆనవాళ్లు కనిపించాయి. కాలిపోయిన ఒక చీర మరియు లోదుస్తులు చెత్తకుండీలో దొరికాయి.

మహిళను వేరే ప్రాంతంలో చంపి, ఆనవాళ్లు దొరకకుండా ఇక్కడ పడేసి నిప్పు పెట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ శవాన్ని ఎవరు తీసుకొచ్చారో తెలుసుకోవడానికి పలు చోట్ల సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే మరణంపై పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు స్పష్టం చేశారు. శవాన్ని పోలీసులు గాంధీ మార్చురీకి తరలించారు.

అదే ప్రాంతంలో గతంలో కూడా శవం దొరికింది

మహిళ శవం దొరికిన ప్రాంతానికి కేవలం 500 మీటర్ల దూరంలోని డీబీఆర్ మిల్స్ ప్రాంగణంలో గల వాటర్ సంప్‌లో 2025 జూన్‌లో గుర్తు తెలియని మహిళ అస్థిపంజరం బయటపడింది. ఆ మహిళ వయస్సు 25 నుంచి 30 ఏండ్ల మధ్య ఉంటుందని, మృతదేహం అక్కడ పడేసి దాదాపు ఆరు నెలలు దాటి ఉంటుందని పోలీసులు గుర్తించారు.

అస్తిపంజరంపై ఉన్న షర్ట్‌జేబుపై 'శ్రీ వివేకానంద హెచ్ఎస్' అని ఉంది. అది వివేకానంద హైస్కూల్ అని భావించిన పోలీసులు ఆ పేరుపై ఉన్న స్కూళ్లలో ఎంక్వైరీ చేయగా ఎక్కడా మిస్సింగ్ కేసులు ఉన్నట్టు తేలలేదు. ఫోరెన్సిక్ రిపోర్ట్ నూ పోలీసులు వెల్లడించలేదు. ఏడాది దాటినా ఈ కేసులో మృతురాలు ఎవరో ఇప్పటికీ గుర్తించకలేకపోయారు.

లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతం రాత్రి భయంకరంగా మారుతుంది

లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో రాత్రి ఏడు దాటితే చిమ్మ చీకటి అలుముకుంటుంది. పక్కనే ఉన్న డీబీఆర్ మిల్స్ మూతపడి నిర్మానుష్యంగా మారింది. దీంతో రాత్రయితే ఈ ఏరియా నుంచి నడిచి వెళ్లాలంటేనే చాలా మంది భయపడుతారు. పెట్రోలింగ్ పోలీసులు కూడా తక్కువగానే వస్తుంటారని, దీంతో బయటి వ్యక్తులు అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపిస్తారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అంతేకాకుండా దగ్గర్లోని బస్తీలు, నాలా వెంబడి ఉండేవారు రాత్రి పూట మద్యంమత్తులో తరచూ గొడవలకు దిగుతుంటారు. చిన్న చిన్న ఆర్థిక లావాదేవీలు, పాత కక్షలతో ఒకరిపై ఒకరు కత్తులు, రాళ్లతో దాడి చేసుకున్న సంఘటనలూ ఉన్నాయి. ఈ ఘర్షణల్లో తీవ్రంగా గాయపడి మృతి చెందిన వారిని లేదా స్పృహ కోల్పోయిన వారిని సమీపంలోని నాలాల్లోకి లేదా నిర్మానుష ప్రదేశాలకు లాకెళ్లి పడేసిన ఉదంతాలు పోలీసు రికార్డుల్లో ఉన్నాయి.

హైదరాబాద్‌లో ఈ కేసుకు సంబంధించిన ప్రశ్నలు

ప్రశ్న: హైదరాబాద్‌లో లోయర్ ట్యాంక్ బండ్‌లో దొరికిన మహిళ శవం ఎవరిది? సమాధానం: ఇప్పటివరకు మృతురాలిని గుర్తించలేదు. పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ప్రశ్న: హైదరాబాద్‌లో ఈ ఘటన ఎప్పుడు జరిగింది? సమాధానం: బుధవారం రాత్రి 10:30 నుంచి 11:30 గంటల మధ్య ఈ సంఘటన చోటుచేసుకుంది.

ప్రశ్న: హైదరాబాద్‌లో లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో రాత్రి భద్రత ఎలా ఉంటుంది? సమాధానం: రాత్రి ఏడు దాటితే చిమ్మ చీకటి అలుముకుంటుంది. పెట్రోలింగ్ పోలీసులు తక్కువగా వస్తుంటారు.

Related Reading

Frequently Asked Questions

What is హ దర బ ద ల యర ట?

హ దర బ ద ల యర ట is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.

Why does హ దర బ ద ల యర ట matter?

హ దర బ ద ల యర ట matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.