సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన పీవీ సింధు.. నెక్ట్స్ ఫైట్ ఒలింపిక్ ఛాంపియన్తోనే!
స మ ఫ నల ల క ద - PV Sindhu: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు జపాన్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నాసియంలో జరగాల్సిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్ నోజోమి ఒకుహరా గాయంతో మ్యాచ్ ప్రారంభానికి ముందే తప్పుకోవడంతో సింధుకు వాకోవర్ (Walkover) లభించింది. దీంతో దాదాపు మూడు సంవత్సరాల తర్వాత సింధు ఒక సూపర్ 750 టోర్నీలో సెమీఫైనల్స్కు అర్హత సాధించినట్లయింది. చిత్రమైన విషయమేమిటంటే, అంతకుముందు రౌండ్లో టాప్ సీడ్ ఆన్ సే-యంగ్ (సౌత్ కొరియా) వైదొలగడంతో ఒకుహరా క్వార్టర్స్ చేరగా, ఇప్పుడు ఒకుహరా తప్పుకోవడంతో సింధుకు లక్ కలిసివచ్చింది.
చెన్ యుఫెయ్తో సెమీస్ సమరం: ప్రస్తుతం ప్రపంచ 10వ ర్యాంకర్ అయిన పీవీ సింధు సెమీఫైనల్లో చైనాకు చెందిన ప్రపంచ 4వ ర్యాంకర్, టోక్యో 2020 ఒలింపిక్ స్వర్ణ పతక విజేత చెన్ యుఫెయ్ (Chen Yufei)తో తలపడనుంది. అంతకు ముందు క్వార్టర్స్ చేరే క్రమంలో చైనాకే చెందిన ప్రపంచ 5వ ర్యాంకర్ హాన్ యుయేను ఓడించిన సింధుకు, చెన్ యుఫెయ్ను ఎదుర్కోవడం ఒక పెద్ద సవాలుగా మారనుంది. వీరిద్దరి హెడ్-టు-హెడ్ రికార్డును పరిశీలిస్తే.. చెన్ యుఫెయ్ 8-6 ఆధిక్యంలో ఉంది. అంతేకాదు, చైనా షట్లర్తో జరిగిన గత 4 మ్యాచ్ల్లోనూ సింధు ఓటమి చవిచూసింది. 2019 బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో చెన్పై సాధించిన గెలుపే సింధుకు చివరిది, ఆ టోర్నీలోనే సింధు గోల్డ్ మెడల్ సాధించింది.
అద్భుతమైన ఫామ్లో చెన్ యుఫెయ్: ప్రస్తుత 2026 సీజన్లో చెన్ యుఫెయ్ అద్భుతమైన ఫామ్లో ఉంది. ఆమె ఆడిన 9 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టోర్నమెంట్లలోనూ కనీసం సెమీఫైనల్స్ చేరడమే కాకుండా, జనవరిలో ఇండోనేషియా మాస్టర్స్ టైటిల్ను కూడా కైవసం చేసుకుంది. మరోవైపు పీవీ సింధుకు ఈ ఏడాది మలేషియా ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత ఇది మూడో సెమీఫైనల్ కాగా, ఈ సీజన్లో ఆమె ఇంకా ఎలాంటి టైటిల్ ఫైనల్కు వెళ్లలేదు. 2024 సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నీనే సింధు గెలిచిన లాస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ కావడం గమనార్హం.
రేసులో మిగిలిన ఏకైక భారతీయురాలు: ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో భారత్ తరపున రేసులో మిగిలిన ఏకైక క్రీడాకారిణి పీవీ సింధు మాత్రమే. పురుషుల సింగిల్స్ ఆరంభ రౌండ్లలోనే స్టార్ షట్లర్ లక్ష్య సేన్, ఆయుష్ శెట్టిలు ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఇకపై ఎన్నో ఆశలు పెట్టుకున్న పురుషుల డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి - చిరాగ్ శెట్టిలు తమ మొదటి రౌండ్ మ్యాచ్లోనే గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ధ్రువ్ కపిల - తనీషా క్రాస్టో జంట ప్రీ-క్వార్టర్స్లోనే ఓడిపోవడంతో భారత్ డబుల్స్ ప్రస్థానం ముందే ముగిసిపోయింది. ఇప్పుడు దేశం చూపులన్నీ సింధుపైనే ఉన్నాయి.
Nozomi Okuhara gives WO to Sindhu ! It means Sindhu enters SFs of #JapanOpenS750 for the very 1st time... Important ranking points ahead of WCH and a SFs clash against CYF probably.. Let's go Sindhu 🙌 pic.twitter.com/TIrR7pN2s4
PV Sindhu proved once again stronger against 5th seed Han Yue🇨🇳 (8-1 H2H) & placed into her 6th QFs of this year in some dominance & fluency!👌 She will meet her familiar opponent & off court friend Nozomi Okuhara🇯🇵 at QFs who got w/o from ASY yesterday. 👍 #JapanOpen2026 https://t.co/MleClcdZEo pic.twitter.com/mDQyx1zhrO