షేక్ హసీనా ప్రెస్ మీట్తో భారత్కు సంబంధం లేదు: కేంద్రం
భారత ప్రభుత్వం షేక్ హసీనా ప్రెస్ మీట్లో పాత్ర లేదని స్పష్టం చేసింది
Indiabreakingdaily.com – ష క హస న ప ర స - బంగ్లాదేశ్ నుండి బహిష్కరించబడి, భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనా 2026 ఆగస్టు 5న నిర్వహించిన మీడియా సమావేశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. శుక్రవారం (ఆగస్టు 7) ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ను ప్రభుత్వం సులభతరం చేయలేదని, ఒక ప్రైవేట్ మీడియా సంస్థ మాత్రమే నిర్వహించిందని స్పష్టం చేశారు.
హసీనా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన ఏ విషయాన్నీ భారత ప్రభుత్వం ఆమోదించదని జైస్వాల్ పేర్కొన్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్లో చట్టబద్ధంగా ఏర్పడిన ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలను భారత్ స్వీకరించదని ఆయన స్పష్టం చేశారు.
హసీనా ప్రధాన వ్యాఖ్యలు
రెండేళ్ల తర్వాత తొలిసారిగా నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో హసీనా అనేక కీలక విషయాలు పంచుకున్నారు. బంగ్లాదేశ్కు అత్యవసర సమయాల్లో ఇండియా ఎప్పుడూ అండగా నిలిచిందని ఆమె అన్నారు. అయితే, ప్రస్తుతం బంగ్లాదేశ్ పాకిస్తాన్లా మారిపోయిందని, ఇది ఇండియాకు ఆందోళన కలిగిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు.
హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో ఇండియా వ్యతిరేక శక్తులను, టెర్రరిస్టులను ఏరిపారేసినట్లు చెప్పారు. మహమ్మద్ యూనుస్ పాలనలో బంగ్లా పూర్తిగా నాశనం అయ్యిందని.. ఆగస్టు 5, 2024 తర్వాత రాజకీయ హత్యలు అధికారికంగా జరుగుతున్నాయని ఆరోపించారు.
బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లాలనుకుంటున్నట్లు హసీనా ప్రకటించారు. తనపై ఉన్న కేసులకు భయపడనని, తను వెళ్తే చంపేయాలని చూస్తున్నారని అయినా వెళ్తానని ఆమె చెప్పారు. అధికారం కోసం కాకుండా, దేశ భద్రత, అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు మరియు శాంతిని నెలకొల్పేందుకే తిరిగి వెళ్లాలనుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు.
2024 ఆగస్టులో ప్రభుత్వం మారిన తర్వాత భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు చెడిపోయాయని, దీనికి ప్రస్తుత పాలకులే కారణమని హసీనా విమర్శించారు. ఆర్థికంగా బంగ్లా క్షీణించిపోయిందని, జీడీపీ మందగించిందని ఆమె అన్నారు. ద్రవ్యోల్బణం పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు.
దేశం నుండి బహిష్కరించబడిన తర్వాత 2024 నుండి వేల మందిని అరెస్టు చేశారని, అవామీ లీగ్ కార్యకర్తలు, నాయకులు మరియు మద్దతుదారులను చిత్రహింసలకు గురిచేశారని హసీనా ఆరోపించారు. పోలీసులు, జర్నలిస్టులు, లాయర్లు, జడ్జీలు మరియు మైనారిటీలను ఘోరంగా హింసించారని ఆమె పేర్కొన్నారు. వారందరికీ భరోసా ఇచ్చేందుకు, దేశంలో శాంతి సామరస్యం నెలకొల్పేందుకైనా తను వెళ్లాల్సి ఉందని ఆమె అన్నారు.
Related Reading
Frequently Asked Questions
What is ష క హస న ప ర స?ష క హస న ప ర స is the main topic of this guide. The article explains the context, practical details, and next steps readers should understand.
Why does ష క హస న ప ర స matter?ష క హస న ప ర స matters because readers are looking for a useful answer, not just a short summary. Good content should match search intent and help them decide what to do next.