విజయవాడ గాదె సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని సీఎం ఆదేశాలు
విజయవాడ గాదె సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని సీఎం ఆదేశాలు
వ జయవ డ గ ద స య - అమరావతిలో సీఎం చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సింగపూర్ పర్యటన పూర్తి అయిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీస్ ఉన్నతాధికారులను కలిశారు.
సాయికృష్ణ అదృశ్యం కేసు విషయంలో సీఎం మరియు డిప్యూటీ సీఎం కలిసి సమీక్ష చేశారు. విషయాల గురించి వివరాలను ముఖ్యమంత్రి మరియు డిప్యూటీ సీఎంకు పోలీస్ ఉన్నతాధికారులు వివరించారు. సీఐ నాగరాజు పై ఆరోపణలకు సంబంధించి చర్యలకు ముఖ్యమంత్రి ఆదేశించారు.
సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విజయవాడ సాయికృష్ణ అదృశ్యం కేసుపై సీనియర్ ఐపీఎస్ అధికారితో దర్యాప్తుకు ఆదేశాలు ఇచ్చారు. నిష్పాక్షపాతంగా దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుండబద్దలు కొట్టారు.
సమీక్షలో పాల్గొన్న అధికారులు
ఈ సమీక్షలో సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హా, విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు పాల్గొన్నారు.
ఏపీలో విజయవాడకు చెందిన గాదె సాయి కృష్ణ అనే యువకుడి మిస్సింగ్ కేసు కలకలం రేపుతోంది. జూన్ 29వ తేదీలోపు హాజరుపరచాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. గాదె సాయి కృష్ణను పోలీసులు కొట్టి చంపారని, డెడ్ బాడీని కృష్ణలంక శ్మశాన వాటికలో కాల్చేశారని, ఆధారాలు లేకుండా చేశారని, బూడిద కూడా ఆ కుటుంబానికి ఇవ్వకుండా చేశారని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేసిన సంగత�