తెలంగాణలో డ్రగ్స్ మాట వినపడొద్దు..ఈగల్ ఫోర్స్కు ఫుల్ పవర్స్ : డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణలో డ్రగ్స్ మాట వినపడొద్దు..ఈగల్ ఫోర్స్కు ఫుల్ పవర్స్ : డిప్యూటీ సీఎం భట్టి
త ల గ ణల డ రగ స - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డ్రగ్స్ సమస్య పై విస్తృత చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈగల్ ఫోర్స్ ద్వారా రాష్ట్రంలో డ్రగ్స్ ఉనికిని పూర్తిగా కట్టడి చేస్తున్నామని, ఈ ఫోర్స్కు ప్రభుత్వం అన్ని రకాల అధికారాలను కట్టబెట్టిందని ఆయన వివరించారు. ఇకపై తెలంగాణలో డ్రగ్స్ అనే మాటే వినిపించకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం అని అన్నారు.
శిల్పకలావేదికలో ఉన్న సదస్సులో పాల్గొన్న భట్టి విక్రమార్క
ఈగల్ ఫోర్స్ యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డ్రగ్స్ విషయంలో పోరాడేందుకు కొత్త స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. డ్రగ్స్ వ్యాపారం చేస్తూనో, వాడుతూనో దొరికితే ఎంతటి వారైనా సరే... కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు చేశారు.
జీవితం చాలా విలువైనది. క్షణికానందం కోసం జీవితాలను అంధకారం చేసుకోవద్దు. ఆరోగ్యవంతమైన యువతను తయారు చేయడమే మా లక్ష్యం. మా పిల్లల భవిష్యత్తే... ఈ రాష్ట్ర భవిష్యత్. ఆ భవిష్యత్తుకు ఎవరు ఆటంకం కలిగించినా... ఎంతమాత్రం ఉపేక్షించేది లేదు అని భట్టి విక్రమార్క తేల్చి చెప్పారు.
సినిమా రంగం నుంచి సహకారం కోరిన భట్టి విక్రమార్క
డిప్యూటీ సీఎం ఈగల్ ఫోర్స్ పై సామాజిక మహమ్మారికి చర్యలు తీసుకుంటామని అన్నారు. సినీ హీరో, హీరోయిన్లు డ్రగ్స్ విరుద్ధంగా విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. థియేటర్లలో సినిమా ప్రారంభం ముందు తప్పనిసరిగా యాం