తాడిచర్ల బ్లాక్ 2కు పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ, మంత్రి
Indiabreakingdaily.com – త డ చర ల బ ల క – మంగళవారం రోజున (జులై 28) ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకటస్వామి కలిసి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ను భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాడిచర్ల బ్లాక్ 2 ప్రాజెక్టుకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అవసరమని వివరించారు. ఈ అనుమతులు లభిస్తే సుమారు వేయి మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని వారు తెలిపారు.
రెండు ప్రాజెక్టులకు ఒకేసారి అనుమతులు కావాలి
ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, ఆర్కేపీ మైన్స్కు కూడా పర్యావరణ అనుమతులు అవసరమని పేర్కొన్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు అనుమతులు లభిస్తే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించబడతాయని వివరించారు. గతంలో బ్లాక్ కేటాయింపు కోసం రెండేళ్ల పాటు పోరాటం చేశామని, ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రావడానికి కూడా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
తాడిచర్ల బ్లాక్ 2లో వెయ్యి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ అవసరం. కేంద్ర మంత్రిని కలిసి తక్షణమే ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశాము.
మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా ఆర్కేపీ మైన్స్కు పెండింగ్లో ఉన్న పర్యావరణ అనుమతులను త్వరగా మంజూరు చేయాలని కోరారు. ఈ అంశాలపై కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ సానుకూలంగా స్పందించారు. సంబంధిత అధికారులతో సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.




