IndiaBreakingDaily
Fast mobile article powered by Nexiamath-SEO AMP.
AMP Article

కిషన్ రెడ్డి గారు.. సింగరేణి కార్మికులకు ఆ గిఫ్ట్ ఇవ్వండి: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ డిమాండ్

Published July 12, 2026 · Updated July 12, 2026 · By Susan Taylor

కిషన్ రెడ్డి గారు.. సింగరేణి కార్మికులకు ఆ గిఫ్ట్ ఇవ్వండి: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ డిమాండ్

సందర్శన అనంతరం విజ్ఞప్తి

క షన ర డ డ గ ర - పెద్దపల్లి జిల్లాకు వస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కేవలం పర్యటనలకే పరిమితం కాకుండా సింగరేణి కార్మికులకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఎంపీ వంశీకృష్ణ.

తాడిచెర్ల మైన్ పేరిట రాజకీయాలు చేయొద్దని... దీనికి సంబంధించిన పర్యావరణ అనుమతులను కేంద్రం నుండి త్వరగా తీసుకువచ్చి, వచ్చే మూడు నెలల్లోనే మైన్ పనులు ప్రారంభమయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ప్రాజెక్టు స్థలాన్ని పరిశీలించిన ఎంపీ

సింగరేణి అధికారులతో కలిసి తాడిచెర్ల కోల్ బ్లాక్ మైన్-2 సందర్శించిన ఎంపీ వంశీకృష్ణ... మైనింగ్ వల్ల ఎన్ని గ్రామాలు ప్రభావితమవుతున్నాయి? ఎంతమంది భూములు కోల్పోతున్నారు? అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్

ఈ మైన్ ప్రారంభమైతే ఏకంగా 50 వేల కోట్ల రూపాయల టర్నోవర్ పెరుగుతుందని... ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందడంతో పాటు స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వంశీకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.

అలాగే, తాడిచెర్ల మైన్ వేదికగానే సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచుతున్