ఇసుకలో BRS నేతలు కోట్లు దోసుకున్నరు.. ఇప్పుడు సర్కార్ ఆదాయం పెరిగింది: మంత్రి వివేక్

Share: X Facebook
minister-vivek-venkataswamy-fires-on-brs_T7hrpsH6vY

ఇస కల BRS న తల క ట – హైదరాబాద్: అధికారంలో ఉన్న పదేండ్లలో బీఆర్ఎస్ నేతలు ఇసుక పేరుతో కోట్ల రూపాయలు దోచుకుతిన్నరని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెన్నూరు నియోజకవర్గంలో కూడా ఇసుక మాఫియా కోట్ల రూపాయలు కొల్లగొట్టిందన్నారు.

2026, జూన్ 8వ తేదీతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా వివేక్ వెంకటస్వామి విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్‎లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సౌండ్, మెటల్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి తనకు ముందే చెప్పారని అన్నారు. సీఎం ఆదేశాల మేరకు ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపామని తెలిపారు.

ఇసుక లారీలు నెంబర్ ప్లేటతో దందా చేయకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఇసుక రవాణా సులభతరం చేయడంతో పాటు ధరల నియంత్రణకు కృషి చేస్తున్నామని తెలిపారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ గనులకు ఆక్షన్ వేయలేదన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విచారణ కొనసాగుతోందని తెలిపారు. సీబీసీఐడీ విచారణలో ఎవరు బాధ్యులుగా తేలిన చర్యలు తీసుకుంటామన్నారు. కేటీఆర్‎ దేనిపైన అవగాహన లేకుండానే మాట్లాడుతారని.. ఇకనైనా గాలి మాటలు మాట్లాడటం మానుకోవాలని విమర్శించారు.

►ALSO READ | తెలంగాణలో జర్మన్ భాష ట్రైనింగ్ సెంటర్స్: మంత్రి వివేక్ వెంకటస్వామి

తుమ్మిడి హట్టి‎పై హరీష్ రావు అన్ని అబద్ధాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖా ఏదైనా నా వంతు కృషి చేసి ఒక మార్పు క్రియేట్ చేస్తానని చెప్పారు. శాఖ అనేది ముఖ్యం కాదని.. పని చేయడం అందులో మన మార్కు చూపించడం ముఖ్యమని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *